మహబూబ్నగర్, ఏప్రిల్ 13: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. మంగళవారం మహబూబ్నగర్లోని పాలకొండలో నూతనంగా ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ చౌరస్తా వద్ద హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. పద్మావతి కాలనీలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణం కోసం ప్రతిక్షణం తపించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అందుకే ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి తెలిపారు.