యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న చిత్రం విడుదల కానుంది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెరవనున్నాడు. ఇక లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కనిపించనున్నట్టు సమాచారం. సీత పాత్రలో కృతిసనన్ లేదా కీర్తి సురేష్లలో ఒకరు నటిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్తో సీతగా కృతిసనన్ ఫిక్స్ అంటూ నెటిజన్స్ చెబుతున్నారు. కృతి రీసెంట్గా ఆదిపురుష్ టీంని కలిసి ఫొటోలు దిగగా, ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ పక్కన కృతి చూడముచ్చటగా కనిపిస్తుంది. సీతారాములుగా కృతి, ప్రభాస్ అలరించడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.