అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రేపటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ముఖ్య నేతల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయ్యాక ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రేపు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని సీఎం జగన్ భావించారు. కానీ కేంద్రమంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన తన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.