ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్ చేశారు. తెల్ల బంగారానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజుల నుంచి సుమారు నెల రోజుల నుంచి లాక్ డౌన్ కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.
గడిచిన వారం రోజుల నుంచి మిర్చి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి పత్తి, అపరాల క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలిరోజు సాగు రైతులు 650 బస్తాలు మాత్రమే తీసుకొచ్చినా భారత పత్తి సంస్థ మద్దతు ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.1,500 అధికంగా పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన