వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆదివారం దళితబంధుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విప్ బాల్క సుమన్తో పాటు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల దళితులు కొంత ముందడుగు వేశారన్నారు. దళితుల అభివృద్ధి జరగాల్సినంత జరగలేదని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారన్నారు. గత పాలకులకు దళితుల ముఖాల్లో ఓట్లు మాత్రమే కనిపించాయన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత పిల్లలు బాగా చదువుకున్నా, మంచి బట్టలు ధరించినా సహించరని పేర్కొన్నారు.