గత ఏడాది కరోనా మహమ్మారి సెలబ్రిటీలని పెద్దగా టచ్ చేయలేదు. కాని సెకండ్ వేవ్లో మాత్రం సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులని వణికిస్తుంది. ముఖ్యమంత్రులు కూడా కరోనా బారిన పడుతున్నారంటే ఈ సారి కరోనా ఉదృతి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పది మంది కరోనా బారిన పడ్డారట.ఈ విషయాన్ని ఆ హీరోయిన్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
గల్ఫ్, యురే,కా అధినేత్రి, గద్దల కొండ గణేష్ చిత్రాల్లో నటించిన బ్యూటీ డింపుల్ హయతి. తాజాగా రవితేజ హీరోగ తెరకెక్కుతున్న ఖిలాడి చిత్ర షూటింగ్లో పాల్గొంటుంది. ఈమె స్వస్థలం తమిళనాడు కాగా, షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చింది. ఈమె ఇక్కడికి వచ్చినప్పుడు తమిళనాడులో లాక్డౌన్ ప్రకటించడంతో ఇక్కడే ఇరుక్కుపోయింది. తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని చెప్పిన హీరోయిన్.. వారిలో పది మందిని మహమ్మారి చుట్టుముట్టిందని తెలిపింది. ఇందులో వాళ్ల తాతగారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితులలో వారికి దూరంగా ఉండడం,వారి ఆరోగ్య పరిస్థితిని తలచుకుంటే బాధ కలుగుతుందని పేర్కొంది డింపుల్.