వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వంద రోజుల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో బైడెన్ ప్రసంగించారు. కరోనా వైరస్పై పోరాటంలో అమెరికా తన పూర్తి బలాన్ని వెచ్చించిందని అన్నారు. మా ప్రభుత్వం నడిపిన టీకా కార్యక్రమం దేశ చరిత్రలో అతిపెద్ద ఘనత అని చెప్పారు.
అమెరికా మళ్లీ పురోగతి మార్గంలో పయనిస్తున్నది జో బైడెన్ అన్నారు. మళ్ళీ మనం పని చేస్తున్నాం, కలలు కంటున్నాం.. క్రొత్త విషయాలను కనుగొంటామని చెప్పారు. అమెరికా మరోసారి ప్రపంచాన్ని నడిపించేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. అమెరికాలో వదులుకోవడానికి ఏమీ లేదని మనమంతా ఉమ్మడిగా ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నదని, మరిన్నిప్రయత్నాలు చేయాల్సి ఉన్నది జో బైడెన్ చెప్పారు. మనం రానున్న రోజుల్లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకమున్నదన్నారు. కరోనా వైరస్ను నివారించాలంటే ప్రజలంతా వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
చైనాతో ఘర్షణ పడటానికి అమెరికా ఇష్టపడటం లేదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా బలమైన సైనిక ఉనికిని కొనసాగిస్తుందని జో బైడెన్ అన్నారు. ఇది సంఘర్షణను నివారించడమే కాకుండా.. ఇతర దేశాలు అలా చేయకుండా నిరోధించగలవన్నారు. ఇదే విషయాన్ని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చెప్పానని తెలిపారు. అమెరికా పోటీని స్వాగతిస్తుంది, కాని ఘర్షణలను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలోని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి అధ్యక్షుడు జో బైడెన్కు ఆహ్వానం పంపారు. దాంతో కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో బైడెన్ తొలిసారి ప్రసంగించారు. 100 రోజుల క్రితం అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించినప్పుడు, అమెరికా పునర్నిర్మాణం కోసం ఎంతో చేయాల్సి వస్తుందన్న ఆశయంతో , ఆశతో ప్రతిజ్ఞ చేశారని బైడెన్కు రాసిన లేఖలో పెలోసి గుర్తుచేశారు. ఈ చారిత్రాత్మక క్షణంలో అనేక సవాళ్లు, అవకాశాలపై మీ అభిప్రాయాలను పంచుకునేందుకు కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించాలని మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నానని పెలోసి చెప్పారు. పెలోసి ఆహ్వానాన్ని మన్నించిన బైడెన్.. కాంగ్రెస్ ఉమ్మడి సమావేశానికి హాజరై ప్రసంగించారు.
బంగ్లాదేశ్లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
‘మహారాష్ట్ర లాక్డౌన్ మరో 15 రోజులు పొడగింపు’: మంత్రి రాజేష్ తోపే
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..