వరంగల్ అర్బన్ : ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎన్నికలు రాగానే వచ్చే పార్టీలకు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడాను మీరే గుర్తించి ఓట్లు వేయండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 12వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కావేటి కవితకి మద్దతుగా దేశాయిపేటలో ప్రచారం నిర్వహించారు.
ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ..మీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా కాలంలో ప్రజలకు సేవ చేస్తూ కవిత భర్త, ఉద్యమ కారుడు రాజు కరోనాతో మరణించారు. ఆమె భర్త ఆశయం కోసం కవిత అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారు. కాబట్టి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి