కమలాపూర్, జూన్ 20: ఏడేండ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు ఇచ్చినా ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో రూ.5 కోట్లతో గూనిపర్తి-చెర్లపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత శనిగరంలో మండల స్థాయి పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే పార్టీలో చేరిన ఈటల రాజేందర్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ధాన్యం కొనడం లేదన్నారు. తెలంగాణ రాకముందు సాగునీరు, కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ దయవల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో సాగునీటికి కొదువ లేదన్నారు. రైతులకు 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నది వాస్తవం కాదా? ప్రజలు, రైతులు ఆలోచన చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం పట్టించుకోని బీజేపీ రాబోయే రోజుల్లో తెలంగాణలో కనుమరుగైపోతుందని జ్యోసం చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, నాయకులు పేరియాల రవీందర్రావు, వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, వకుళాభరణం కృష్ణమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.