మునిపల్లి /సంగారెడ్డి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంకోల్లో గల అభిషేక్ గార్డెన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో పని చేసిన ప్రభుత్వలు ప్రజల కోసం పట్టించ్చుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత..సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారని తెలిపారు. దేశం గర్వించేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ మీనాక్షి, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆస్థి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న
హుజూరాబాద్లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం