మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మే 9 : ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటు సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం తమ సొంతం అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో దివిటిపల్లికి చెందిన కృష్ణారెడ్డికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహయ నిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్యంపై ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాడం ఆంజనేయులు తదితరులు ఉన్నారు.