వనపర్తి : సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని గోపాల్పేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..పేదలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం అంకూర్ సమీపంలో గుడ్డిమోత వాగుపై నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
గోపాల్ పేట మండలం బుద్దారం – వనపర్తి రహదారి నుంచి ధర్మతండాకు రూ.68 లక్షల వ్యయంతో నిర్మించే రహదారికి శంకుస్థాపన చేశారు. రూ.2.9 కోట్లతో రేవల్లి మండలం తల్పునూరు – కేశంపేట (వయా తల్పునూరు తండా) రహదారికి పాత తండా వద్ద శంకుస్థాపన చేశారు.
అలాగే గోపాల్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, సిజెంట కంపెనీ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పది నూతన బెడ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ కొత్త మొక్కకు జలకన్య పేరు పెట్టిన శాస్త్రవేత్తలు
Supreme Court: జడ్జీల నియామకాల వార్తలపై సీజేఐ రమణ తీవ్ర అసంతృప్తి
స్వర్ణ ప్రాజెక్ట్ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి