డబ్ల్యూఈఎఫ్ నుంచి ఒక రాష్ట్ర మంత్రికి తొలిసారి 2017లో ఆహ్వానం అందింది. దావోస్లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వరుసగా ఆహ్వానాలు అందుతున్నాయి. 2017, 2018, 2019, 2020, 2021 సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులు, విధానాల గురించి వివరించి తెలంగాణలోని అవకాశాలను చాటి చెప్పారు. ‘వర్కింగ్ టుగెదర్ రిస్టోరింగ్ ట్రస్ట్’ నినాదంతో జరుగుతున్న తాజా సమావేశంలో రెండువేలమంది పాల్గొంటున్నారు.