హైదరాబాద్,మే 11 : కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు భద్రత అందించడానికి వ్యక్తిగతమైన ఫీచర్లతో వెర్ట్యూసా ప్రత్యేక సేవలు రూపొందించింది. 24/7 కొవిడ్- 19 కేర్ పోర్టల్ను ప్రవేశపెట్టింది. వెర్ట్యూసా కొవిడ్-19 చొరవలో ఒక విశిష్టమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్క టీమ్ సభ్యుడు, వారి కటుంబాల పట్ల దీనికి వ్యక్తిగతమైన దృక్పథం ఉంటుంది, ఏ ఒక్క విషయాన్నీ విడిచిపెట్టకుండా చూసుకుంటుంది. 24/7 ప్రత్యక్ష మద్దతు, సహాయంతో, లాగ్ అయిన అన్ని ప్రశ్నలనూ, వ్యాక్సినేషన్లకు సంబంధించి టీమ్ సభ్యుల డేటానూ పోర్టల్, కాల్ సెంటర్ పర్యవేక్షిస్తూ ఉంటాయి.
24/7 కొవిడ్-19 కేర్ పోర్టల్ కార్యక్రమాలకు వెర్ట్యూసా చీఫ్ పీపుల్ ఆఫీసర్ సుందర్ నారాయణన్, నాయకత్వం వహిస్తారు. ఇతర నాయకులు, వాలంటీర్లతో కలిసి పని చేస్తారు. “వెర్ట్యూసాలో ప్రతి సభ్యుడికీ, వారి కుటుబాంలకూ సంరక్షణ అందేలా ఖచ్చితంగా చూడడం కోసం మరిన్ని ప్రయోజనాలను ప్రవేశపెట్టే ఒక పరిపూర్ణమైన నమూనాను ప్రవేశపెట్టడం మా లక్ష్యం.. ఈ మేరకు డాష్బోర్డును ప్రతి రోజూ మేము సమీక్షిస్తాం” అని నారాయణన్ తెలిపారు. “ప్రపంచంలో ఎక్కడైనా ఏ సంక్షోభ పరిస్థితి తలెత్తినా దానిని అనుసరించి, వినియోగించుకొనేలా తీర్చిదిద్దిన డిజిటలైజ్ అయిన ఒక నమూనాను నిర్మించడం మా ఉద్దేశం” అని ఆయన అన్నారు.