అమీర్పేట్, ఆగస్టు 7 : దేశవ్యాప్తంగా ఉన్న కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు కొండా దేవయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్ హోటల్ హరిత ప్లాజాలో నిర్వహించిన వేదిక తొలి సమావేశంలో దేవయ్య మాట్లాడుతూ ఐక్యవేదికను బలోపేతం చేసేందుకు ఇటీవలే సంస్థ లోగోను ఆవిష్కరించినట్టు తెలిపారు. కాపులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు వేదిక ద్వారా కృషి చేస్తామన్నారు. త్వరలోనే జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఐక్యవేదిక ఎన్నారై విభాగం కన్వీనర్గా తోట రామ్కుమార్ను నియమించారు. సమావేశంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్బాబు, కస్టమ్స్ అధికారి మంగ బాపు, కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం, డాక్టర్ బూరగడ్డ శ్రీనివాస్, కాచిగూడ ట్రస్ట్ బోర్డు సభ్యుడు జెల్లి సిద్ధయ్య, టీఎంకేజేఎఫ్ అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు చల్లా హరిశంకర్, సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్, కాపుసేన తెలంగాణ అధ్యక్షుడు ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.