మంచిర్యాల : పంట నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు. రైతులతో మాట్లాడిన అనంతరం మంచిర్యాల జిల్లా వరదలపై శ్రీరామ్ పూర్ గెస్ట్ హౌస్లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..వరద ప్రభావం, పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించాం. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పేర్కొన్నారు.ఇప్పటికే నష్ట పరిహారం విషయంపై సోమవారం (సెప్టెంబర్ 8) న ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందించాం. నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో 5,545 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.
సమస్య తీవ్రతను ముఖ్యమంత్రికి వివరించి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అక్కసు వెలిబుచ్చడానికే విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇకనైనా రాజకీయాలు పక్కన బెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు.
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అధికారులు మరమ్మతులు చేయాలి. సీజనల్ వ్యాధులు, కరోనాలపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు తగు జాగ్రత్తలు సూచనలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతీ హొళికేరీ, వెంకటేశ్వర్లు ( ఈఎన్ సీ కాళేశ్వరం ప్రాజెక్ట్), ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో