న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్వల్పకాలం కార్ల ధరలు సుస్థిరంగానే కొనసాగుతాయని ఫోక్స్ వ్యాగన్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశీష్ గుప్తా వెల్లడించారు. వచ్చే నెల నుంచి కార్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతుందన్నారు. కరోనా రెండో వేవ్ కేసులు పెరుగుతున్నా.. గత రెండు నెలలుగా డిమాండ్-సప్లయి సమతుల్యంగా ఉందని చెప్పారు.
ఈ ఏడాది తొలి మూడు నెలలు కార్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. కానీ కరోనా కేసులు పెరుగడంతో ఏప్రిల్, మే నెలల్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ల వల్ల గత నెలలో కొనుగోళ్లు పడిపోయాయి. మున్ముందు కార్ల కొనుగోళ్లకు డిమాండ్ వేగం పుంజుకుంటుందని ఆశీష్ గుప్తా చెప్పారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత రెండు నెలలుగా తమ సిబ్బంది, డీలర్ నెట్వర్క్స్ బాగోగులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. పరిమిత సిబ్బందితో ఫోక్స్ వ్యాగన్ ఇండియా తన యూనిట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు ఎత్తివేశాక పరిస్థితులు చక్కబడతాయని ఆశీష్ గుప్తా తెలిపారు. పండుగల సీజన్ నాటికి గ్రోత్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్సనల్ మొబిలిటీ అవసరాల రీత్యా విక్రయాలు పెరుగుతాయని చెప్పారు.
షెడ్యూల్ ప్రకారం సీ-సెగ్మెంట్ ఎస్యూవీ టైగూన్ను విపణిలోకి ఆవిష్కరించనున్నట్లు అశీష్ గుప్తా తెలిపారు. ఈ ఏడాది పండుగల సీజన్లో న్యూ టైగూన్ను ఆవిష్కరిస్తామని చెప్పారు.
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
స్పేస్స్టేషన్కు వెళ్తూ పగటి పూట స్పష్టంగా కనిపించిన స్పేస్క్రాఫ్ట్.. వీడియో
అందుకే వారు తెల్లారేసరికి కోటీశ్వరులు..ఎలాగంటే
జొమాటో టార్గెట్: 9 ఏండ్లలో పూర్తిగా విద్యుత్ వాహనాలవైపు!!
త్వరలో విపణిలోకి జియో 5జీ ఫోన్.. ధరెంతంటే?!
డిసెంబర్కల్లా రూ.60 వేలకు బంగారం?!
వృద్ధుల కోసం స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు..!!
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చార్జీలు.. ఏ బ్యాంకులో ఎంత అంటే …?
ఎస్బీఐ కస్టమర్లకు గమనిక.. ఆ పత్రాలు సమర్పిస్తేనే సేవలు
జూన్ 30 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను పొడిగించిన పేటీఎం…
చికిత్స కోసమే ఇండియా వదిలాను.. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని!
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..