డీపీఎస్లో ముమ్మర ఏర్పాట్లు
ప్రతి డివిజన్కు రెండు టేబుళ్లు
ఒక్కో రౌండ్లో రెండు వేల ఓట్ల లెక్కింపు
నెగెటివ్ వస్తేనే ఏజెంట్లకు అనుమతి
అధికారులకు కలెక్టర్, బల్దియా కమిషనర్ దిశానిర్దేశం
వరంగల్, మే 1 : గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా అధికార యం త్రాంగం సన్నాహాలు చేస్తున్నది. లెక్కింపు జరుగనున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ పమే లా సత్పతి కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌం టింగ్ కోసం డీపీఎస్లో మూడు బ్లాకులను ఏర్పాటు చేశా రు. ప్రతి డివిజన్కు 2 టేబుళ్లు కేటాయించారు. రౌండుకు రెండు వేల ఓట్లు లెక్కించనున్నారు. కరోనా నేపథ్యంలో కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెగెటివ్ వస్తేనే అనుమతి ఇస్తున్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు ఆదివారం సాయం త్రం వరకు డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల్లో వేసేందుకు అవకాశం ఉంది. 66 డివిజన్లలో 2352 మంది ఓటర్లకు బల్దియా అధికారులు పోస్టల్ బ్యాలెట్ను అందజేశారు. ఇందుకోసం డివిజన్ల వారీగా 66 బాక్సులను ఏర్పాటు చేశారు.
కరోనా పరీక్షలు..
కౌంటింగ్ హాల్కు వచ్చే అభ్యర్థులు, వారి తరఫున వచ్చే ఏజెంట్లకు కార్పొరేషన్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారికి మాత్రమే పాస్లు జారీ చేస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా దరఖాస్తులు సమర్పించిన 714 మందికి కరోనా పరీక్షలు చేయగా సుమారు 45 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
లెక్కింపు పకడ్బందీగా జరుగాలి : కలెక్టర్
గ్రేటర్ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరుగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. శనివారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులకు కమిషనర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీల్ తెరువాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత తిరస్కరణ పోస్టల్ ఓట్లకు కారణాలు స్పష్టంగా రాయాలని సూచించారు. డివిజన్కు ఐదుగురు సిబ్బంది ఉంటారన్నారు. ప్రతి టేబుల్కు ఇద్దరు కౌంటిం గ్ సిబ్బంది, ఒక సూపర్వైజర్తో పాటు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వారి ఆర్డర్ ప్రకారం నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపులో 1900 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని ఎన్నికల అధికారి తెలిపారు.
లెక్కింపు పరిసరాల్లో 144 సెక్షన్..
హన్మకొండ సిటీ: కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కిం పు జరిగే రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లు సీపీ తరుణ్జోషి తెలిపారు. సోమవారం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. గుంపులుగా ఉండడం నిషేధమని, అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.