మహబూబ్నగర్ : మహబూబ్నగర్ను దేనికి తీసిపోని విధంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ లేబరేటరీని ప్రారంభించారు. హరితహారం కింద మెడికల్ కళాశాలలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మహబూబ్నగర్ దవాఖానను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే 400 కోట్ల రూపాయల వ్యయంతో మరో హాస్పిటల్ను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మెడికల్ కళాశాల కు అనుబంధంగా నర్సింగ్, డెంటల్ ,ఫార్మా కళాశాల లు వస్తాయని, వైద్య రంగంలో మహబూబ్ నగర్ ను హైదరాబాద్ కు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
వైద్యులు, బోధన సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని, అదేవిధంగా విద్యార్థులు కూడా విద్యనభ్యసించిన ప్రాంతాన్ని కళాశాలను మరువద్దని కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ లో ‘సంపద వనం’లో ఎంతో విలువైన వృక్ష సంపదను అభివృద్ధి చేసేందుకు శ్రీగంధం, ఎర్రచందనం, మహాఘని, టేకు మొక్కలను నాటారు.
మొక్కల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ రాం కిషన్, ఆర్డీవో పద్మశ్రీ, డాక్టర్ శామ్యూల్, కౌన్సిలర్ కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం
అభివృద్ధి పనుల్లో అలసత్వంపై మంత్రి పువ్వాడ ఆగ్రహం
ఆమె ఫిర్యాదుతో సువేందు అధికారిపై కేసు నమోదు
మొక్కల సంరక్షణ బాధ్యత స్థానిక సంస్థలదే
నేరేడ్మెట్ పోలీసు స్టేషన్కు గద్దర్
వెయ్యి మొక్కలు నాటించిన మంత్రి పువ్వాడ