హైదరాబాద్ : టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుంటుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ శ్రీనివాస్నగర్కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ధన్రాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సహకారంతో పార్టీ నుంచి మంజూరు అయిన రూ. రెండు లక్షల ప్రమాద బీమా చెక్కును లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి ధన్రాజ్ తల్లి రాణికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృధ్దితో పాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల