మహబూబ్నగర్ : పాలమూరు డీసీసీబీని పటిష్టం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ పటిష్టం కోసం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మహబూబ్ నగర్ డీసీసీబీ మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు ఉద్యోగుల పనితీరును పెంచేందుకు వివిధ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
రుణాల వసూలుకు డీసీసీబీ డైరెక్టర్లు, సీఈఓలు ప్రధాన పాత్ర వహించాలన్నారు. డీసీసీబీ డైరెక్టర్లంతా శ్రద్ధ తీసుకుని బ్యాంకు రుణాల రికవరీకి సహకరిస్తే మరింత సాయం అందించేందుకు టెస్కాబ్ సిద్ధంగా ఉందన్నారు. సబ్సిడీ రుణాలు, సబ్సిడీ పథకాలు ఆయా బ్రాంచులు, సొసైటీల పరిధిలోని రైతాంగానికి తెలిసేలా చర్యలు తీసుకుని వారికి మేలు చేకూర్చాలన్నారు.
రుణాలు ఇవ్వడమే కాకుండా వాటిని సకాలంలో తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటేనే సహకార సంఘాలకు లాభం చేకూరుతుందన్నారు. డీసీసీబీ చైర్మన్లు, డైరెక్టర్లు, సహకార సంఘాల చైర్మన్లు , డైరెక్టర్లు క్రియాశీలకంగా పనిచేస్తేనే సహకార సంఘాలు పటిష్టమవుతాయిని మంత్రి స్పష్టం చేశారు. ఆర్.బి.ఐ నిబంధనల ప్రకారం అడిట్లు సమయానుసారంగా నిర్వహించాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
పాలమూరు డీసీసీబీని పటిష్టం చేసేందుకు అందరూ కలిసి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఉమ్మడి పాలమూరులోని 77 సహకార సంఘాలను బలపరిచి పటిష్టం చేయాలన్నారు. డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, సహకార సంఘాల చైర్మన్లు కలిసికట్టుగా పనిచేసి ప్రణాళికాబద్దంగా ముందుకుసాగాలన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అండగా ఉండాలన్నారు.
సహకార సంఘాలు పటిష్టమైతే గ్రామాల్లోనే రైతులకు సులువుగా రుణాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ఎండీ మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, సీఈఓ ప్రకాష్, వైస్ చైర్మన్ వెంకటయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం
రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి