వనపర్తి : కొత్తకోట మండలం పాలెం గ్రామంలో మంగళవారం రాత్రి పిడుగు పడి 39 గొర్రెలు మృతి చెందాయి. కాగా బాధిత గొర్రెల కాపరులను బుధవారం జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ పెండెం కురుమూర్తి యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జిల్లా పశు సంరక్షణ శాఖ అధికారి మధుసూదన్, వెంకటేశ్వర్లు పరామర్శించారు. ప్రమాద సంఘటన విషయాన్ని కురుమూర్తి యాదవ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఫోన్లో తెలియజేశారు.
ఈ మేరకు గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధికార ప్రతినిధి గాడిలా ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్