బెంగళూరు: హుబ్లీలో పెళ్లింట విషాదం నెలకొన్నది.పెండ్లి జరిగి కొన్నిగంటలు కూడా గడవకముందే పెండ్లి కుమారుడు మృతి చెందాడు. మరుసటి రోజే వరుడిని మృత్యువు బలితీసుకుంది. పచ్చటి తోరణాలు కళకళలాడుతుండగానే పెళ్లింట చావుడప్పు మోగింది. అటు వరుడు, ఇటు వధువు ఇండ్లలో విషాదాన్ని మిగిల్చిన ఈఘటన హుబ్లీ జిల్లాలోని కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శశికుమార్ పట్టణ శెట్టికి శనివారం అతని స్వగృహంలో హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహమైంది. అనంతరం వధువు ఇంటికి నవదంపతులు వెళ్లారు. ఆదివారం శశికుమార్ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి తుదిశ్వాశ వదిలాడు. దీంతో శుభకార్యం జరిగిన కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.