వనపర్తి, మే 26 : అనవసరపు కారణాలు చెబుతూ, బయటకు వస్తున్న వారిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని ఎస్పీ అపూర్వరావు ప్రజలకు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్చౌరస్తా, బస్టాండ్, రామాలయం ప్రాంతాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి లాక్డౌన్ కొనసాగుతున్న తీరును పరిశీలించి వాహనదారులను ఆపి బయటకి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకి రాకూడదన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ కఠినంగా అమలుల్లో ఉంటుదన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. ఇటువంటి విపత్కర సమయాలలో నిబంధనల ఉల్లంఘన చేయడం అత్యంత బాధ్యారాహిత్యం అని ప్రజలు గ్రహించాలన్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలుకు వెసలుబాటు ఇచ్చిన సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించి ఉదయం 10 గంటల లోపు దుకాణదారులు తమ కార్యకలాపాలను పూర్తి చేసుకోవాలని, ఆ పైన ఒక్క నిమిషం ఆలస్యమైనా నిబంధనల ఉల్లంఘనగా భావించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్కుమార్, పట్టణ ఎస్సై మధుసూదన్, ట్రైనింగ్ ఎస్సైలు నరేశ్కుమార్, శ్రీకాంత్, వరలక్ష్మి, నస్రీన్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
పెద్దమందడి, మే 26 : లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కిరణ్కుమార్ ఎస్సై సీ హెచ్ రాజుకు సూచించారు. బుధవారం మండల కేంద్రం లో కొనసాగుతున్న లాక్డౌన్ను ఆయన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు తప్పకుండా పాటించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించాలని సూచించా రు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
కరోనాపై బైక్ ర్యాలీతో పోలీసుల అవగాహన
పెబ్బేరు, మే 26 : ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు పెబ్బేరు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని వివి ధ వార్డులో పోలీసులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ కరోనాపై అవగాహన కల్పించారు. ఇన్చార్జి ఎస్సై రాము నేతృత్వంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించా రు. కార్యక్రమంలో ట్రైనింగ్ ఎస్సైలు సుమలత, శ్రీలత, లక్ష్మీనారాయణ, వెంకటేశ్, ఏఎస్సై రోశయ్య, పోలీసులు రజిని బాబు, రమేశ్, నరసింహ, రమేశ్ సాగర్, భీమయ్య, ఆనంద్, రవి, బాలరాజు, తయార్, మల్లికార్జున్ ఉన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
ఖిల్లాఘణపురం, మే 26 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని ఎస్సై వెంకటేశ్గౌడ్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవన్నారు. వాహనదారులు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారని వాహనాలను సీజ్ చేయడంతోపాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడికి వాహనదారులు సహకరించాలని అత్యవసరమైతే తప్పా బయటికి రాకూడదన్నారు.
కొనసాగుతున్న లాక్డౌన్
కొత్తకోట, మే 26 : మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొసాగుతున్నది. ఉదయం 10 గంటల తర్వాత వాహనా లు, వ్యాపారాలు మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యం గా మారాయి. అనుమతి లేకుండా వచ్చిన వాహానాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
లాక్డౌన్కు సహకరించాలి
పాన్గల్, మే 26 : లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఎస్సై విజయభాస్కర్ కోరారు. బుధవారం మండలకేంద్రంతోపాటు పలుగ్రామాల్లో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు లాక్డౌన్ను పర్యవేక్షించి వాహనాలను తనిఖీ చేశారు. కా ర్యక్రమంలో ఏఎస్సై శ్రీనివాస్గౌడ్, పోలీసులు ఉన్నారు.