నిజామాబాద్ : కరోనా బాధితులకు అండగా ఉంటానని, వారికి సహాయ సహకారాలు అందించేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనా బాధితులకు, వారి సహాయకులకు భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత భోజన వితరణ వాహనాలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి దివంగత బిగాల కృష్ణమూర్తి దివ్య స్మృతిలో భాగంగా జిల్లా కేంద్రంలో కరోనాతో బాధపడుతూ హోం ఐసొలేషన్లో ఉన్న బాధితులకు, వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు, వారి సహాయకులకు భోజన వితరణ కార్యక్రమాన్ని తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని తన తండ్రి ఎప్పుడూ చెబుతుండేవాడని అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే