న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా వెనక్కి తగ్గింది. తన స్వరాన్ని తగ్గించింది. భారత్ ముందస్తు అనుమతి లేకుండా భారత ప్రదేశిక జలాల్లో నేవీ ఆపరేషన్ నిర్వహించిన యూఎస్.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తాము ఈ పని చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇండియా అనుమతి అవసరం లేదన్నట్లూ మాట్లాడింది.
అయితే ఇప్పుడా దేశం కాస్త వెనక్కి తగ్గుతూ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7న యూఎస్ నేవీ 7వ ఫ్లీట్లో భాగమైన యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్, హిందూ మహా సముద్రంలో రొటీన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ నిర్వహించింది. అంతర్జాతీయ చట్టాలకు, ప్రపంచవ్యాప్తంగా సముద్రాల స్వేచ్ఛకు అమెరికా మద్దతు తెలపడంలో భాగంగా ఈ పని చేశాము. వివిధ అంశాల్లో మేము భారత భాగస్వామ్యాన్ని గౌరవిస్తాం. ఇండోపసిఫిక్లో ప్రాంతీయ భద్రత కూడా అందులో భాగం అని అమెరికా రక్షణ శాక్ష అధికార ప్రతినిధి అన్నారు.
లక్షదీవులకు సమీపంలో యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ డెస్ట్రాయర్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఇండియా వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. సముద్ర చట్టాలు ఇతర దేశాల మిలిటరీ చర్యలను అంగీకరించవని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి