లక్నో: రెండు దశాబ్దాలకు పైగా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా 38 ఏండ్ల మిథాలీ చరిత్రకెక్కింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేయడం ద్వారా మిథాలీ ఈ మార్క్ను చేరుకుంది. మహిళల క్రికెట్లో మిథాలీ 10,001 పరుగులతో రెండో ప్లేస్లో ఉండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్ట్స్ 10,273 పరుగులతో అగ్రస్థానంలో ఉంది. అరుదైన ఘనత సాధించిన మిథాలీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ అభినందించారు. ఆటకు వన్నెతేవడంతో పాటు.. ముందు తరాలకు ప్రేరణగా నిలుస్తూ.. మమ్మల్ని గర్వపడేలా చేశావని పేర్కొన్నారు. 1999లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ 212 వన్డేల్లో 6974.. పది టెస్టుల్లో 663.. 89 టీ20ల్లో 2364 పరుగులు చేసింది. అందులో 8 సెంచరీలు, 75 అర్ధశతకాలు ఉన్నాయి.
లక్నో: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పరాజయం పా లైంది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం తేలిన ఉత్కంఠ పోరులో మిథాలీ బృందం 6 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 248 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (77) వరుసగా రెండో అర్ధశతకం నమోదు చేయగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (36), హర్మన్ప్రీత్ కౌర్ (36), దీప్తి శర్మ (36 నాటౌట్) రాణించారు. అనంతరం వరుణుడి ఆగమనంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సఫారీల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలో 218గా నిర్ణయించారు. ఓపెనర్ లిజెల్లె లీ (132 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి గెలిచింది.
మ్యాచ్లు పరుగులు
వన్డేలు: 212 6974
టెస్టులు: 10 663
టీ20లు: 89 2364
ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) 10,273
మిథాలీరాజ్ (భారత్) 10,001
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 7849
స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్) 7816
మెగ్ ల్యానింగ్ (ఆస్ట్రేలియా) 6900