ఔరంగాబాద్, ఏప్రిల్ 7: కరోనా విలయంతో గతంలో కనిపించిన హృదయవిదారక దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. వైరస్ బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు శ్మశానంలో స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలను కాల్చివేసిన ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో మంగళవారం జరిగింది. మృతదేహాలకు తొలుత అంబాజ్గాయ్ పట్టణంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించాలని భావించామని ఒక అధికారి తెలిపారు. అయితే అవి కరోనా బారిన పడి మరణించిన వారి శవాలు కావటంతో స్థానికులు అభ్యంతరం చెప్పారని, దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో శ్మశానవాటికకు తరలించామన్నారు. అయితే, అక్కడ స్థలం సరిపోకపోవడంతో పెద్దగా పేర్చిన ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామన్నారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్