కుటుంబ సభ్యులతో కలిసి భర్తే చంపాడని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
సోన్, ఏప్రిల్ 2 : నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన టీడీ ఆనంది (25) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి , కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని టీచర్స్కాలనీకి చెందిన బత్తుల భూమన్న, లక్ష్మి కుమార్తెను నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన టీడీ సుకుమార్తో 2016లో వి వాహం జరిపించారు. రెండేళ్లుగా వీరి కాపురం సవ్యంగా సాగింది. ఆ తర్వాత మనస్పర్థలతో తరచుగా గొడవలు జ రుగుతున్నాయి. ఆనంది గురువారం ఆదిలాబాద్లో జరిగిన ఓ ఫంక్షన్కు వెళ్లి రాత్రికి వెంగ్వాపేట్కు చేరుకున్నది. శుక్రవారం మధ్యాహ్నం ఆనంది శరీరంపై గాట్లు చేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని, రక్తస్రావం అవుతుందని దవాఖానకు తీసుకెళ్తున్నామని సుకుమార్ చెల్లి ఆనంది తండ్రి భూమన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. నిర్మల్ దవాఖానకు చేరుకునేసరికే మృతిచెందిందని డాక్టర్లు చెప్పా రు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలోకి తరలించా రు. తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులు మృతదేహం మెడపై గాట్లు ఉండడం, వెనుకభాగం నుంచి రక్తం కారడం, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టిన గాట్లు ఉన్నాయని గుర్తించి ఇది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపిస్తూ పోలీసులకు ఫి ర్యాదు చేశారు. భర్తతో పాటు అత్త, వారి కుటుంబసభ్యుల కు కఠినంగా శిక్ష పడేలా చూడాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా.. నిర్మల్ డీఎస్పీ ఉ పేందర్రెడ్డి, సీఐ వెంకటేశ్, ఎస్ఐ మిథున్ చక్రవర్తి వెంగ్వాపేట్కు చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. భర్తతో పాటు అ త్త, చెల్లి, బావను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అన్ని కోణాల్లో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి తెలిపారు.
అనాథలైన ఇద్దరు చిన్నారులు..
సుకుమార్, ఆనందికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ధృవన్షికి రెండేళ్లు కాగా.. మరో రెండునెలల బాబు ఉన్నాడు. తల్లి మృతి చెందడం, తండ్రి పోలీస్స్టేషన్కు వెళ్లడంతో చిన్నారులు అమ్మనాన్న లేని అనాథలు అయ్యారని గ్రామస్తులు, కుటుంబసభ్యులు కన్నీంటిపర్యాంతమయ్యారు.