సంగారెడ్డి మున్సిపాలిటీ/కోహీర్, ఏప్రిల్ 1: రోజురోజుకూ సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత గతంలో కంటే అధికమవుతున్నది. ఉదయం 11 గంటలు దాటిందంటే కాలు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకువచ్చే వారు మా త్రం ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.
వడదెబ్బ లక్షణాలు…
ఎండల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారిలో విపరీతమైన జ్వరంతో నాడి వేగంగా కొట్టుకోవడం, తలనొప్పి, చికాకు, కండరాల నొప్పి, ముదరు రంగులో మూత్రం, చర్మం వాడిపోవడం, స్పహ తప్పిపోవడం జరుగుతుంది. ఎండలో వెళ్లవలసిన పరిస్థితుల్లో తలపై టోపీ, రుమాలు తప్పకుండా ధరించాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, పండ్ల రసాలు తాగి బయటకు వెళ్తే ఎండ నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. ఆల్కహాలు తాగడంతో రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ చెమట వచ్చేలా చేస్తాయి. అది విషమ పరిస్థితికి దారి తీస్తుంది. ఆల్కహాల్ తాగడం తగ్గించాలి. ఇంటి గదు లు, కిటికీలు, తలుపులకు తెరలను వినియోగించడంతో వేడిని తగ్గించవచ్చు. ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండీషనర్లను ఉపయోగించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స చేయించాలి. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా వడదెబ్బ (సన్స్ట్రోక్), డీ హైడ్రేషన్ సాధారణంగా వచ్చే వ్యాధులు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకమేనని పలువురు వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ముందు జాగ్రత్త చర్యలు…
ప్రథమ చికిత్స…
ఇవీ కూడా చదవండీ..
దేశమంతా నందిగ్రామ్ వైపే చూస్తోంది : సువేందు అధికారి
చిన్నారులకు టీకా ఇచ్చేందుకు అధ్యయనం : రణదీప్ గులేరియా