మహబూబాబాద్ : ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని రామగిరిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు.
కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు ధరించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సహృదయతను చాటుకున్న ఏసీపీ ఉమేందర్
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
కరోనాతో మేడారం పూజారి భార్య మృతి
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్