నల్లగొండ : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్ లతో సమావేశం నిర్వహించి ధాన్యం ఆన్ లోడింగ్ పై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం ననుసరించి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మిల్లుల వద్ద నిలిచి పోయిన లారీల నుంచి వెంటనే ధాన్యం ఆన్ లోడింగ్ చేసుకోవాలని మిల్లర్ లను ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేంద్రం వారీగా వ్యవసాయ శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు టోకెన్ జారీ చేసి క్రమ పద్ధతిలో కోనుగోళ్లు నిర్వహించాలన్నారు.
చింతపల్లి మండలం నాసర్లపల్లి గ్రామంలో నాణ్యతా లేదన్న కారణంగా ధాన్యం దించుకోవడం లేదని టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేసిన వెంకట సాయి మిల్లును తెరిపించాలని మిల్లర్లు కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో పౌరసరఫరాల డీఎం నాగేశ్వరరావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రాణం పోసిన దవాఖానలో.. మొక్కను నాటిన మహిళ
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
కొనుగోలు కేంద్రాలతోనే రైతులకు మేలు