మేడ్చల్ మల్కాజిగిరి : రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. శుక్రవారం కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి షామీర్పేట మండలం అలియాబాద్ రైతు సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టని పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
దీనికి గాను సీఎం కేసీఆర్ రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ద్వారా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు పథకం కింద డబ్బులు జమచేస్తున్నారని గుర్తు చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తూ వారికి మంచి చేయాలనే సంకల్పంతో రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారని వివరింకచారు. ప్రస్తుతం వ్యవసాయాన్ని పండగలా చేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.
రైతువేదికలను రైతుల కోసం నిర్మించారని వారు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏ పంట వేస్తే బాగుంటుందనే వివరాలను చర్చించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం పలువురు రైతులను సన్మానించి వారికి సాయిల్ హెల్త్ కార్డులను అందచేశారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి రేఖా మేరి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, జిల్లా కన్వీనర్ కృష్ణారెడ్డి, డీసీఎంసీ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఆర్డీవో రవి, షామీర్పేట ఎంపీపీ ఎల్లుబాయి, అలియాబాద్ సర్పంచ్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్