మేడ్చల్, మే 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు 108 అంబులెన్స్లు నిరంతరాయంగా సేవలందిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే వారి ని వివిధ వైద్యశాలలకు తరలిస్తున్నా యి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లోని 27 అంబులెన్స్లను అధికారులు వినియోగిస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో కొవిడ్ బాధితులకు ప్రత్యేకంగా ఏడు అంబులెన్స్లను కేటాయించారు. అయితే అవి సరిపోకపోవడంతో జిల్లా అధికారులు మరో ఇరవై అంబులెన్స్లను వినియోగిస్తున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు 40 నుంచి 50 మంది మొత్తంగా 1,573 కొవిడ్ బాధితులను అంబులెన్స్ల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవే ట్ వైద్యశాలలకు తరలించారు. కొవిడ్ బాధితులకు సేవలందించేందుకు 108 సిబ్బంది 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. బాధితులను తరలించే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాన్ని శానిటైజ్ చేయడంతో పాటు పీపీఈ కిట్లు వాడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 27 అంబులెన్స్లతో కొవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాం. సమాచారం అందగానే బాధితులు కోరిన దవాఖానలో చేర్పిస్తు న్నాం. ఏప్రిల్లో 813 బాధితులకు సేవలు అందించాం. రెండు నెలలుగా 108 సిబ్బంది నిత్యం పని చేస్తున్నారు. కొవిడ్ బాధితులను అంబులెన్స్లో తరలించే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయా ల్లో ఆక్సిజన్ అందిస్తున్నాం. – నరేందర్రెడ్డి, మేడ్చల్, 108 కో ఆర్డినేటర్
వైద్యశాలకు వచ్చే రోగులకు ప్రత్యేక శ్రద్ధతో వైద్యం చేస్తున్నాం. కరోనాతో బాధపడుతున్న రోగులను గుర్తించి ఐసొలేషన్ కేంద్రానికి పంపుతున్నాం. వైద్యశాలలో 10 ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నది. అత్యాధునిక వసతులు అందుబాటులో ఉన్న ఈ వైద్యశాలలో రోగులకు అవసరమైన అన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్