సంగారెడ్డి : పెండింగ్ బిల్లుల చెల్లింపులో యాజమాన్యం విఫలమైనందున డ్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని వేలం వేయాలని సంగారెడ్డి జిల్లా యంత్రాంగం నిశ్చయించింది. జహీరాబాద్లోని డ్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ 840 మంది రైతులకు రూ.11.5 కోట్లు బకాయి పడింది. 2019-20 క్రషింగ్ సీజన్కు గాను రైతులకు చెల్లింపుల విషయంలో ఫ్యాక్టరీ విఫలమైందని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు తెలిపారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర అధికారులు మేనేజ్మెంట్తో పలుమార్లు సమావేశమై చర్చించగా చెల్లింపులు చేస్తామని అంగీకరించింది. అయినప్పటికీ మేనేజ్మెంట్ తన వాగ్దానాన్ని నిలుపుకోలేదు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని వేలం వేసేందుకు ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలిపారు.