నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతోనే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయన్నారు. కరోనా కట్టడిలో వైద్యులు, సిబ్బంది, ఆశవర్కర్లు, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లాలో లక్షా యాభై వేల మందికి ఉచితంగా కొవిడ్ టెస్ట్ను చేసినట్లు తెలిపారు. అపోహలను వీడి, ప్రతి ఒక్కరు ఈ టీకాను వేసుకోవాలని సూచించారు.