జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ బరాజ్లో 10.884 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు సంబంధిత ఇంజినీర్ అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర నుంచి ప్రాణహిత జలాలు భారీ స్థాయిలో తరలివచ్చి లక్ష్మీ బరాజ్లో కలుస్తున్నాయి. దీంతో బరాజ్లోని 85 గేట్లలో శుక్రవారం 15 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు తరలిస్తున్నారు. బరాజ్కు 11,100 క్యూసెక్కుల ఇన్ఫ్లో,10,600 క్యూసెక్కుల ఔట్ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బ్లాక్ మార్కెట్లో పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్లో హైటెక్స్ నిర్మాణానికి టీఎస్ఐఐసీ అనుమతులు
రైతువేదికలు ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
మొక్కలు నాటి సంరక్షిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్