కుమ్రం భీం ఆసిఫాబాద్ : వర్షాకాలంలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇబ్బంది కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై నిలిచిన నీటిని జూబ్లీ మార్కెట్ ప్రాంతాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారిపై నిలిచిన నీటిని త్వరగా తొలగించాలని తెలిపారు.
అలాగే శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జూబ్లీ మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ వర్షం తో ఏర్పడిన బురద తొలగించాలన్నారు. మార్కెట్ కు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జూబ్లీ మార్కెట్ లో మిగిలి ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.