నందికొండ, జూలై 20: అరుదుగా కనిపించే నీటి కుక్కలు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ రిజర్వాయర్లో సం దడి చేస్తున్నాయి. సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతుండటంతో నీటికుక్కలు రిజర్వాయర్ నీటిమట్టం వద్ద, లాంచీ స్టేషన్ సమీపంలో సంచరిస్తున్నాయి. అరుదుగా కనిపించే ఈ నీటికుక్కలు గతంలో కొల్లాపూర్, మన్ననూర్ సమీపంలో మత్స్యకారులకు చిక్కగా వాటిని నెహ్రూ జూ పార్కుకు తరలించారు. నీటిలో ఉండే ఈ జంతువులు చేపలను ఆహారంగా తీసుకుంటాయని, ఈ జాతి చాలా వరకు కనుమరుగైపోతున్నదని అటవీ అధికారులు తెలిపారు.