హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈనెల 25న బోర్డు సమావేశం జరగనుంది. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటి లభ్యత అంచనా, కేటాయింపులు తదితర అంశాలను ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా, మిగులు జలాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై గతేడాది నుంచీ చర్చ నడుస్తున్నది. దీనిపై కమిటీని నియమించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. అదేవిధంగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో.. కేంద్రప్రభుత్వం డీపీఆర్లను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ విషయాలు కూడా చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి