టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్ను సోమవారం గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వెడ్డింగ్ బ్రేక్ తర్వాత బుమ్రా ఈనెలాఖరులో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. పెళ్లి కోసమే ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్లకు బుమ్రా సెలవులు తీసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభంకాబోతున్న నేపథ్యంలో బుమ్రా ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ క్యాంప్లో చేరనున్నాడు.
మార్చి 26-28 మధ్య బుమ్రా ముంబై జట్టుతో కలవనుండగా అదే రోజు నుంచి వారం రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత జట్టుతో కలిసి చెన్నై బయలుదేరి వెళ్లనున్నాడు. ఇంగ్లాండ్తో పుణె వేదికగా జరగాల్సిన వన్డే సిరీస్కు అతడు అందుబాటులో ఉండేది సందేహంగా మారింది.