హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు వారాల క్రితం కరోనాతో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతి చెందాడు. నాటి నుంచి పిల్లల పోషణ భారమైందనే మనోవేదనలో ఉన్న సుబ్రహ్మణ్యం భార్య నిన్న రాత్రి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు తెలిపారు. మహిళ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆల్వాల్ పోలీసుల సమక్షంలో నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.