సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15: తెలంగాణలోని గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నాయని.. తడి, పొడి చెత్త సేకరణ విధానం బాగుందని కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుద్ధ్యశాఖ డిప్యూటీ సెక్రటరీ రాజీవ్ జవహరి కొనియాడారు. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డి, రాఘవాపూర్, ఇర్కోడులో బుధవారం ఆయన పర్యటించారు. పెద్దలింగారెడ్డిలో పల్లె ప్రకృతి వనం, పాఠశాల, డంపింగ్యార్డ్డును పరిశీలించారు. రాఘవాపూర్లో పాఠశాల, డంపింగ్యార్డ్డు, శ్మశానవాటిక, ఇర్కోడులో పశువుల హాస్టల్, డంపింగ్యార్డును పరిశీలించారు. గ్రామాల్లో పచ్చదనం బాగున్నదని జవహరి ప్రశంసించారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయని, తడి, పొడి చెత్త వేరుగా సేకరించి డంపింగ్ యార్డుల్లో ఎరువులు తయారు చేయడాన్ని అభినందించారు. అంతకుముందు పెద్దలింగారెడ్డిలోశ్రమదానం చేసి రాఘవాపూర్లో మొక్కలు నాటారు.