వరంగల్: నకిలీ కరెన్సీ నోట్లు ముద్రిస్తున్న దంపతులను వరంగల్ పోలీస్లు అరెస్ట్ చేశారు.
కాశీబుగ్గకు చెందిన దంపతులు వంగరి రమేశ్, సరస్వతిలను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలో 100, 50, 20 రూపాయల దొంగనోట్లను దంపతులు మార్కెట్లో చెలామణి చేస్తున్నారు.
వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని నకిలీ నోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హన్మకొండ, వరంగల్లో రద్దీగా ఉండే షాపుల్లో దొంగనోట్లను చెలామణీ చేస్తున్నారు. నిందితుల నుంచి రూ.10లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.