వరంగల్: వరంగల్ భద్రకాళిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. భద్రీ తటాకంలో చక్రస్నానం నిర్వహించడం జరిగింది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం జరగనుంది. అలాగే హంస వాహనంపై భద్రకాళి అమ్మవారు విహరించనున్నారు.