కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు ఫస్ట్ డోస్ కోవిడ్ వాక్సిన్ తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకుంది కాజల్. గౌతమ్తో కలిసి దిగిన ఫొటోకు.. ఫస్ట్ షాట్ అయిపోయింది..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఇద్దరు ముంబైలో వాక్సిన్ వేయించుకున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్యలో వన్ ఆఫ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయనుంది కొరటాల శివ అండ్ టీం.
ఇవి కూడా చదవండి..
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
జాన్వీ గ్లామర్ షోకు షేక్ అవుతున్న సోషల్ మీడియా