ములుగు : జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతోంది. ములుగు మండలంలోని జగ్గన్నగూడెం ముసలి మడుగు ప్రాంతంలో కొన్ని రోజులుగా పులి సంచరిస్తున్నదని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఆదివారం ముసలి మడుగు ప్రాంతంలో పర్యటించారు.
అక్కడ ఉన్న అడుగులను పరిశీలించి పెద్దపులి అడుగులుగా నిర్ధారించారు. దట్టమైన అడవి లోపలికి పశువుల కాపరులు, ప్రజలు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. ఎప్పుడు ఎవరిపై పులి దాడి చేస్తుందేమోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అంగన్ వాడీలకు అండగా ఉంటాం : మంత్రి హరీశ్రావు
Taliban and Weapons : తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
Rain Alert | రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన