కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో మోగుతున్న పెండ్లి బాజాలు
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
నాగర్కర్నూల్ టౌన్, మార్చి 31 : పేద కుటుంబాల్లోని ఆడ బిడ్డలకు అండగా నిలబడేందుకు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింట పెండ్లి బాజాలు మోగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గా ర్డెన్స్లో నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 188 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎ మ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మా ట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన ఆడ బిడ్డ పెండ్లికి ఆ కుటుంబాలు పడుతున్న బాధను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఈ పథకాన్ని ప్రారంభించారని తె లిపారు. ఆడబిడ్డ కలిగిన ఏ కుటుంబం కూడా పెండ్లి చేసే విషయంలో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో వారిలో ధైర్యం నింపేందుకు ఈ పథకం ప్రారంభించారని చెప్పారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనా భాస్కర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్రెడ్డి, తాసిల్దార్లు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.