బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు బెంగళూరులోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల కిందటి పరువు నష్టం కేసులో ఆయన రూ.2 కోట్లు చెల్లించాలని బెంగళూరులోని ఎనిమిదవ సివిల్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మల్లన గౌడ ఆదేశించారు. 2011 జూన్ 28న ఓ కన్నడ న్యూస్ చానెల్లో ‘గౌడర గర్జన’ పేరుతో ప్రసారమైన కార్యక్రమంలో దేవెగౌడ.. నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడర్ ఎంటర్ప్రైజెస్ (నైస్) ప్రాజెక్టును దోపిడీ అంటూ పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ దేవెగౌడపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది.