హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడింది. రూ. 19.5 కోట్ల విలువ చేసే 3 కిలోల హెరాయిన్ను ఓ ఆఫ్రికన్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పట్టుకొన్నారు. టాంజానియాకు చెందిన ప్రయాణికుడు జో హన్నస్బర్గ్ నుంచి దోహా మీదుగా హైదరాబాద్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో అతడి లగేజీని తనిఖీ చేయగా హెరాయిన్ పట్టుబడ్డట్టు వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు? హైదరాబాద్లో ఎక్కడికి దీన్ని తరలిస్తున్నారు? ఇక్కడ ఈ ముఠాకు సహకరిస్తున్నది ఎవరు? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.